సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని నేడు సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
నిజానికి.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రజాసంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రతీ ఒక్కరికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించేందుకు అనేక చర్యులు తీసుకుంటున్నారు.