బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సి ఆర్ పి సి సెక్షన్ 313 కింద తమ వాంగ్మూలాలను రికార్డ్ చేయడానికి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని లక్నోలోని సీబీఐ కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాల ప్రకారం.. అవసరమైనప్పుడు కోర్టు నిర్ణయించిన తేదీల్లో ఈ ముగ్గురు నిందితులు హాజరై తమ వ్యక్తిగత వాంగ్మూలాలను ఇవ్వాలని ఆదేశించింది. కాగా, ఈ ముగ్గురు నిందితులు చివరిసారిగా మే 26 2017 న సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.