జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. కొవిడ్-19 అనుమానిత లక్షణాలు ఉండటంతో మంగళవారం ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే.. 51 ఏండ్ల కేజ్రీవాల్కు మధుమేహ సమస్య ఇప్పటికే ఉన్నది. ‘ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగలేదు. స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయనకు దగ్గు, గొంతు నొప్పి ఉన్నది.
మంగళవారం ఆయనకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తారు’ అని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సోమవారం మీడియాకు వెల్లడించారు. కాగా, వచ్చే రెండువారాల్లోగా ఢిల్లీలో కొవిడ్-19 కేసుల సంఖ్య 56 వేలకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్జైన్ తెలిపారు.