వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్ పై విమర్శలు చేశారు. చంద్రబాబు జగన్ పాలనను చూసి ఓర్వలేకపోతున్నారని.... కుట్రలతో ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈరోజు మీడియా సమావేశంలో అవంతి మాట్లాడుతూ తాజాగా ఒక సర్వేలో దేశంలోని టాప్ 5 సీఎంలలో ఒకరిగా సీఎం జగన్ కు గుర్తింపు వచ్చిందని అన్నారు. 
 
టీడీపీ రైతుల కష్టాల గురించి పట్టించుకోలేదని.... ఆరోగ్యశ్రీ పథకాన్ని టీడీపీ నీరు గార్చిందని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్‌కు సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదని అన్నారు. గత ఐదేళ్లగా చంద్రబాబుని భ్రష్టు పట్టించింది లోకేష్ అని... లోకేష్ నాయకత్వాన్ని ఎమ్మెల్యేలలో ఒక్కరైనా ఒప్పుకుంటారా...? అని వ్యాఖ్యలు చేశారు. లోకేష్ వల్లే టీడీపీ పూర్తిగా దెబ్బతిన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: