ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సినీ ప్రముఖులు మరి కాసేపట్లో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్ లకు సంబంధించి వారు జగన్ తో చర్చించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ తో సినీ ప్రముఖులు ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై అదే విధంగా సినిమా థియేటర్ ల ఓపెనింగ్ సహా పలు అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

 

ఈ నేపథ్యంలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబు, త్రివిక్రమ్, కొరటాల శివ, సి.కళ్యాణ్ తదితరులు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వారు అందరూ హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: