ద్రోహులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. పార్టీ నేతలతో నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్య చేసారు. పార్టీ మారిన వరిని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేసారు. పార్టీకి ద్రోహం చేసిన వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. పార్టీ ద్రోహులు చరిత్ర హీనులుగా మిగిలి పోతారన్నారు.

 

పార్టీకి ద్రోహం చేసిన వారెవరినీ ప్రజలు ఆదరించరని స్పష్టం చేసారు. ద్రోహులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నారు. సిఎం జగన్ స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కరోనా కిట్లు, బ్లీచింగ్ పౌడర్‌లోనూ స్కామ్‌లేనని చంద్రబాబు ఎద్దేవా చేసారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి దుర్మార్గానికి తెగించలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: