ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 216 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ కేసులలో రాష్ట్రానికి చెందిన 147 మంది కరోనా భారీన పడగా మిగిలిన కేసులు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు చెందిన వారివని తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో ఐదో విడత లాక్ డౌన్ సడలింపుల తర్వాత రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,990కు చేరింది. రాష్ట్రంలో 2,403 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 1,510 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 77కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: