హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ నాయకులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సోషల్ మీడియాలో తమ శుభాకాంక్షలను బాలయ్యకు అందిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ట్విట్టర్ వేదికగా విష్ చేసారు.
అరవై ఏళ్లొచ్చినా ఇరవై ఏళ్ల నవయువకుడి అందం, హుషారు, ఆరోగ్యంతో బాలయ్య బాబు నిండు నూరేళ్లు వర్థిల్లాలి అని ఆయన పేర్కొన్నారు. ఇక ఉత్తరాంధ్ర నేతలు అందరూ కూడా ఆయనకు విష్ చేస్తున్నారు. కొందరు బాలయ్యతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
అరవై ఏళ్లొచ్చినా ఇరవై ఏళ్ల నవయువకుడి అందం, హుషారు, ఆరోగ్యంతో బాలయ్యబాబు నిండు నూరేళ్లు వర్థిల్లాలి.#HappyBirthdayNBK
— Kinjarapu Atchannaidu (@katchannaidu) June 10, 2020