ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 218 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 15,384 నమూనాలను పరీక్షించగా 218 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రానికి చెందిన 136 మంది కరోనా భారీన పడగా మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారని తెలుస్తోంది. 
 
ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,126కు చేరింది. రాష్ట్రంలో 2,475 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందటంతో మృతుల సంఖ్య 78కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1573 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: