రాజ్యాంగ వ్యవస్థలను సిఎం వైఎస్ జగన్ నిర్వీర్యం చేసారని ఏడాది గడిచినా సరే కోడి కత్తి గాని బాబాయి హత్య కేసు గాని ఇప్పటి వరకు విచారణకు రాలేదు అని తప్పుడు కేసులతో ప్రజలను వేధిస్తున్నారని ఆయన  ఆరోపించారు. సోషల్ మీడియాలో కార్యకర్తలపై కేసులు మోపి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

 

రాష్ట్రంలో రాజ్యాంగం అనేది లేదని రాజా రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు అంటూ చంద్రబాబు ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో పరిపాలన అనేది లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా మండిపడ్డారు. కరోనా విషయంలో విఫలం అయ్యారు అని వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: