తమిళ రాజకీయ నాయకురాలు మరియు ప్రఖ్యాత నాటి జయలలిత జీవిత కథాంశం తో తెరకెక్కుతున్న చిత్రం తలైవి. గత కొద్ది రోజులుగా తలైవి విడుదలపై తమిళ నాట సందిగ్ధం నెలకొంది. మొదట్లో ఓటిటి ద్వారా విడుదల చేయాలనుకున్న నిర్మాతలు మళ్లీ మాట మార్చారు. ఈ విషయమై  చిత్ర నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి క్లారిటీ ఇచ్చారు. అయితే మొదట సినిమాథియేటర్లలో విడుదల చేసిన తరువాత ఓటిటి ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేస్తామని అయన వివరించారు.

 


ఇంకా ఈ సినిమా చివరి షెడ్యూల్‌ మిగిలిఉండడంతో ఈ చిత్రాన్ని హైద‌రాబాద్‌ లో షూట్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే కరోనా సిటీ లో ఘోరం గా వ్యాపిస్తున్న నేపథ్యం లో షూటింగ్ ని హైద‌రాబాద్‌ లో చేయాలా లేక తమిళనాడులో చేయాలా అన్న సందిగ్ధం లో ఉన్నారు నిర్మాతలు. అయితే ఈ సినిమా ట్రైలర్ ను మొదట రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఈ సినిమాలో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి  జయలలిత పాత్రలో బాలీవుడ్ అందాల తార కంగనా రనౌత్ నటిస్తున్న విషయం అంతా తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: