తెలంగాణాలో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు అనే చెప్పాలి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం తెలంగాణాలో కనపడటం లేదు. ఇక ఇప్పుడు అక్కడ పెరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముందు రాష్ట్రంలో మరణాలు లేవు. అయినా సరే ఇప్పుడు మరణాలు వేగంగా పెరుగుతున్నాయి. 

 

ప్రతీ రోజు కూడా మరణాలు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కంగారు పడుతుంది. ముందు  కేసులు పెరిగే విషయంలో ఏపీ కన్నా మెరుగ్గానే ఉన్నా సరే మరణాల విషయంలో మాత్రం 200 దిశగా వెళ్తుంది తెలంగాణా. దీనిపై ఇప్పుడు కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. తెలంగాణా లో ఇప్పటి వరకు 156 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: