కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు మన దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక తమిళనాడు విషయంలో అయితే ఇప్పుడు పరిస్థితి భయంకరంగా ఉంది అని చెప్పవచ్చు. తమిళనాడు లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అక్కడి సర్కార్ జనాలను బయటకు రావొద్దు అని చెప్తున్నా సరే ఎవరూ కూడా వినే పరిస్థితి కనపడట౦ లేదు.

 

ఇక తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక వార్నింగ్ ఇచ్చింది. తమిళ పరిశోధన, అభివృద్ధి శాఖ మంత్రి మాఫోయ్‌ పాండ్యరాజన్‌ మాట్లాడుతూ... కరోనా ప్రభావిత ప్రాంతాల్లో తిరిగే వారిని కచ్చితంగా క్వారంటైన్ కి తరలిస్తామని స్పష్టం చేసారు. అనవసరంగా ఎవరు బయటకు వచ్చినా సరే చర్యలు ఉంటాయి అని ఆయన హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: