ఏడాదిగా ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఉన్నత న్యాయ స్థానాలను కూడా ప్రభుత్వం లెక్క చేయడం లేదని, ఏడాది కాలంగా  రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైసీపీ విధానాలు ప్రజలకు చేటు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 

 

ఏపీ ప్రజలకు తాజాగా చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. టీడీపీ హయాంలో కన్నా వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం మెరుగుగా ఉందని ఆయన అన్నారు. అయిన సరే సంక్షేమ తగ్గించారు అని అభివృద్ధి అసలే లేదు అని మండిపడ్డారు. పాలకుల కక్ష సాధింపు కారణంగా ఏపీ ప్రజలు నష్టపోతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: