తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు చలో సెక్రటేరియట్ కి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంగ్రెస్ నేతలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ కీలక నేతలు అందరిని కూడా పోలీసులు ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఉత్తమ కుమార్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేసారు. 

 

అదే విధంగా మండలి పక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క ను, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇక కూన శ్రీశైలం గౌడ్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక కోమటిరెడ్డి ఈ పరిణామం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే అదుపులోకి తీసుకుంటారా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: