రాజస్థాన్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్నా మొన్నా కాస్త పరిస్థితి భయపెట్టినా నేడు పర్వాలేదనిపించింది. అక్కడ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఈ రోజు రాజస్థాన్‌లో 51 పాజిటివ్ కేసులు & 5 మరణాలు సంభవించాయి అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 

 

గత 24 గంటల్లో కరోనా నుంచి 27 మంది వ్యాధి నుండి కోలుకున్నారు & 26 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు అధికారులు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11651 గా ఉంది. వీరిలో కరోనా కారణంగా 264 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఇప్పటి వరకు  8596 మంది కోలుకున్నారు. 8221 మందిని డిశ్చార్జ్ చేసారని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: