కడప జిల్లా రిమ్స్ లో ఒక గర్భిణి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చి బాలింత కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయింది అని అధికారులు పేర్కొన్నారు. ఆమె మృతదేహానికి రాత్రికి రాత్రే పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడం కాస్త వివాదాస్పదంగా మారింది. కరోనాతో మరణించిందని ఉన్నతాధికారులు చెబుతున్నా సరే వారి బంధువులు మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం చేయడంతో కాస్త ఆందోళన నెలకొంది. 

 

ఆమెకు కరోనా రాలేదు అని వైద్యుల తప్పిదం తో ఆమె ప్రాణాలు కోల్పోయి ఉంటారు అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై ఉన్నతాధికారులు ఇంకా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: