ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కేసుల తీవ్రత అత్యంత భయంకరంగా పెరుగుతుంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా  ఇదే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 135 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 

 

మొత్తం ఏపీలో 1641 క్రియాశీల కేసులు ఉన్నాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు  2540 మంది డిశ్చార్జ్ అయ్యారు అని ప్రభుత్వం పేర్కొంది. గత 24 గంటల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 80 మరణాలతో సహా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4261 గా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: