మొన్నటి వరకు కరోనా వైరస్ తో తీవ్రంగా ఇబ్బంది పడిన చైనా ఇప్పుడు వరదలతో ఇబ్బంది పడుతుంది. ఆ దేశం మొత్తం కూడా భారీగా వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా నీట మునిగాయి అని చైనా ప్రభుత్వం పేర్కొంది. లక్షల మంది అక్కడ నిరాశ్రయులు అయ్యారు.
దక్షిణ, మధ్య చైనాలలో వరదల కారణంగా 24 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా తర్వాత ఇది అతి పెద్ద విపత్తు అని చైనా ప్రభుత్వం పేర్కొంది. లక్షలాది ఇల్లు నీటిలో కొట్టుకుని పోయాయి. నిరాశ్రయులైన 2.30 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఎనిమిది రాష్ట్రాల్లోని 110 నదులు పొంగిపొర్లుతున్నాయి అని అధికారులు పేర్కొన్నారు.