రాజస్థాన్ ప్రభుత్వాన్ని బిజెపి టార్గెట్ చేసిందా...? అంటే అవుననే అంటున్నారు ఆ రాష్ట్ర సిఎం అశోక్ గెహ్లాట్. తమ ప్రభుత్వాన్ని కూల్చాలి అని బిజెపి ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. తమ ఎమ్మెల్యేలతో బిజెపి చర్చలు జరుపుతుందని ఆయన మండిపడ్డారు. ఒక పక్క కరోనా ఉన్నా సరే తమ మీద కుట్రలు చేస్తుంది కేంద్రం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. 

 

కాగా ఇప్పటికే మధ్యప్రదేశ్ లో బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా బిజెపి టార్గెట్ చేసింది అనే ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ కి ఎవరు షాక్ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మధ్యప్రదేశ్ లో సింధియా వర్గం షాక్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: