దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే దాని పని చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే కరోనా బిజెపి నేతలకు ఇప్పుడు పెద్ద తల నొప్పిగా మారింది. ఇటీవల వరుసగా కరోనా బారిన పడుతున్నారు బిజెపి నేతలు. తాజాగా కరోనా బారిన పడి ఒక బిజెపి నేత ప్రాణాలు కోల్పోయారు. 

 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఢిల్లీ కమిటీ చైర్మన్ సంజయ్ శర్మ కరోనా కారణంగా మరణించారు అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఆయన పేదలకు సహాయం అందించడానికి గానూ చేసిన సామాజిక కార్యక్రమాల్లో ఆయనకుఇ కరోనా సోకింది అని బిజెపి నేతలు పేర్కొన్నారు. కాగా ఢిల్లీ లో కేసులు 31 వేలు దాటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: