తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాజిటివ్కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. అయితే.. తెలంగాణ సర్కార్ కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేయడం లేదని, పరీక్షలను అస్సలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఇదే అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. అయితే.. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
తెలంగాణ కరోనా మోడల్ అంటూ.. *కరోనాని చూడకు... కరోనాని టెస్ట్ చేయకు .. మరణాలు లెక్కించకు.. కాలం కలిసి రాక ఎవరైనా కరోనాతో ప్రాణం విడిస్తే ‘రామ్ నామ్ సత్య హై’ అని గమ్మున అనుకోని ఏమయ్యిందో కూడా చెప్పకుండా దాచిపెట్టు* అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
🔹తెలంగాణ కరోనా మోడల్ 🔹
— arvind dharmapuri (@Arvindharmapuri) June 11, 2020
కరోనాని చూడకు... కరోనాని టెస్ట్ చేయకు .. మరణాలు లెక్కించకు
కాలం కలిసి రాక ఎవరైనా కరోనాతో ప్రాణం విడిస్తే ‘రామ్ నామ్ సత్య హై’ అని గమ్మున అనుకోని ఏమయ్యిందో కూడా చెప్పకుండా దాచిపెట్టు.. pic.twitter.com/l6yoQRq6cJ