ఈ ఏడాది ఫిబ్రవరి 20 న సిఎఎ-ఎన్‌ఆర్‌సి వ్యతిరేక ర్యాలీలో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాన్ని లేవనెత్తిన అముల్య లియోనాకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ వివాదం అప్పట్లో సంచలనం సృష్టించింది. పక్కనే ఉన్న అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు షాక్ అయి ఆమె నుంచి మైక్ కూడా లాక్కున్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కర్ణాటక పోలీసులు ఆమెపై కేసులు నమోదు చేసారు. 

 

ఇక కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే.  కొంత మంది బిజెపి కార్యకర్తలు అయితే ఆమెను ఉరి తీయాలి అంటూ డిమాండ్ లు కూడా చేయడం గమనార్హం. ఈ పరిణామంపై కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: