పశ్చిమగోదావరి జిల్లాను కరోనా వైరస్ షేక్ చేస్తుంది. కరోనా వైరస్ కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా జంగారెడ్డిగూడెంలో కరోనా కలకలం అందరిని ఆందోళనకు గురి చేసింది. ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యగికి కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు అక్కడి ప్రజలు అందరూ భయపడుతున్నారు. 

 

అతను రాజమండ్రి నుండి విజయవాడకు రోజూ బ్యాంక్ పనిమీద తిరుగుతూ అందులో భాగంగా నాలుగు రోజుల క్రితం జంగారెడ్డిగూడెం బ్రాంచ్‌కి రాగా అతనికి దగ్గు మొదలయింది. దీనితో స్థానిక మందుల షాపులో అతను ఆధార్ కార్డు చూపించి మందులు కూడా తీసుకున్నాడు. ఆధార్ అడ్రస్ ఆధారంగా రాజమండ్రి తాడితోటలో ఉద్యోగిని గుర్తించిన అధికారులు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: