తెలుగుదేశం శాసనసభ్యులు అచ్చెన్నాయుడుగారు ఏమయ్యారు? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు. నాతో సహా, వారి కుటుంబ సభ్యులెవరికీ ఆయన ఫోను అందుబాటులో లేదన్నారు. ఈ ప్రభుత్వం ఆయనను ఏం చేసింది? ఆయన్ను 100 మంది పోలీసులతో అక్రమంగా, చట్ట విరుద్ధంగా ఎందుకు కిడ్నాప్ చేయించారు? అని ప్రశ్నించారు. 

 

ఎక్కడకు తీసుకువెళ్ళారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు..ముందస్తు నోటీసు ఇవ్వలేదు..బడుగు, బలహీనవర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసం,అన్యాయాలపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుడుగారిపై జగన్ కక్షగట్టి ఇలా కిడ్నాప్ చేయించడం దారుణమని ఆరోపించారు. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి సీయం జగన్‌, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యలకు నిరసనగా బడుగుబహీనవర్గాలవారు, మేధావులు, ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా జోతిరావుఫూలే, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి తమ నిరసనను తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: