విజయవాడలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరగడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే అంశం. ఈ తరుణంలో నగరంలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య పెద్ద మొత్తంలో పెరుగుతుంది. నగర వ్యాప్తంగా మొత్తం 64 డివిజన్లకుగాను 45 డివిజన్లకు విస్తరించింది కరోనా వైరస్. కంటైన్మెంట్ జోన్లు వ్యాపార కేంద్రమైన బీసెంట్ రోడ్డును కూడా అధికారులు కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి తీసుకుని వచ్చారు. 

 

కంటైన్మెంట్ జోన్లలో శుక్రవారం నుంచి కఠినమైన ఆంక్షలు, నిబంధనలు ఉంటాయి అని అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు కంటైన్మెంట్ జోన్లల్లోంచి బయటకు వచ్చే సమయాన్ని కూడా తగ్గించారు. ఉదయం 6 గంటల నుంచి11 గంటల వరకు అనుమతిచ్చారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: