ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ కీలక నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 150 కోట్ల ఈఎస్ఐ స్కామ్ లో విజిలెన్స్ అధికారులు అచ్చన్నాయుడు పాత్ర ఉందని నిర్ధారించిన నేపథ్యంలో ఏకంగా 300 మంది పోలీసులు మాజీమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన అచ్చన్నాయుడు ఇంటిని చుట్టుముట్ట అరెస్టు చేయడం పెద్ద దుమారమే రేపింది.
అయితే తాజాగా వీడియో సమావేశం నిర్వహించారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు అరెస్ట్ పై స్పందించిన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... అక్రమ కేసులు బనాయించి అధికార పార్టీ అచ్చన్నాయుడు ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని ఎలాంటి సమాచారం లేకుండా అరెస్టు చేశారు అంటూ ఆరోపించారు చంద్రబాబు నాయుడు. సంబంధం లేని స్కాంలో అచ్చెన్నాయుడును బలిపశువును చేశారు అంటూ మండిపడ్డారు.