మహారాష్ట్రలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఇక అక్కడి పోలీసు అధికారులలో ఇప్పుడు కరోనా కేసులు బయటపడటం అవి కూడా భారీగా నమోదు కావడం భయపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. తాజాగా మహారాష్ట్ర పోలీసుల్లో దాదాపు 130 కరోనా కేసులు బయటపడ్డాయి అని అధికారులు పేర్కొన్నారు. 

 

తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. గత 48 గంటల్లో, మహారాష్ట్ర పోలీసులలో 129 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 36 మంది పోలీసులు కరోనా కారణంగా మరణించారు అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. 1945 మంది పోలీసులకు కరోనా రికవరీ అయింది. మొత్తం అక్కడ 3,388 మంది పోలీసులకు కరోనా సోకింది అని మహారాష్ట్ర పోలీసులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: