దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే ఏ విధంగా కూడా ఫలితం అనేది కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక దేశ రాజధాని ఢిల్లీ  మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో లాక్ డౌన్ ని పెంచే ఆలోచనలో అక్కడి ప్రభుత్వాలు ఉన్నాయి అనే ప్రచారం జరిగింది. 

 

తాజాగా దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అసలు లాక్ డౌన్ ని పెంచే ఆలోచన లేదని అన్నారు. అదే విధంగా మహా సిఎం ఉద్దావ్ థాకరే మాట్లాడుతూ లాక్ డౌన్ ని ఇంకా తాము కొనసాగించలేము అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: