ఒక పక్క కరోనా కేసులతో దేశం మొత్తం ఇబ్బంది పడుతున్నా సరే కొందరిలో మాత్రం మార్పు అనేది ఎక్కడా కనపడటం లేదు. లాక్ డౌన్ ని పాటించాలి అనే సూచనలు చేసినా సరే ప్రజలు మాత్రం పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు అనే చెప్పాలి. 

 

తాజాగా కర్ణాటకలో  జరిగిన ఒక వ్యవహారం సంచలనంగా మారింది అనే చెప్పాలి. కర్ణాటక లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నా సరే హవేరిలోని కర్జాగి గ్రామంలో 'కారా హున్నిమ్' ఉత్సవంలో నిన్న భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎడ్ల బండ్లతో ఊరేగింపు కూడా నిర్వహించారు. దీనితో అక్కడ సామాజిక దూరం అనేది ఎక్కడా లేకుండా పోయింది అనేది స్పష్టంగా అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: