ఈ మధ్య దొంగలకు కరోనా రావడంతో పోలీసులు, వాళ్ళు చోరీ చేసిన బాధితులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఒక సంఘటన జరిగింది. అది ఏంటీ అంటే ఒక దొంగ కు కరోనా ఉంది. ఆ దొంగ... ఢిల్లీ ఐఐటీ వద్ద ఓ విమాన పైలట్ కారులో విమానాశ్రయానికి వెళుతుండగా దారి కాచి దొంగతనం చేసాడు.

 

ఈ కేసులో మొత్తం 5 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక దొంగ వాంతులు చేసుకున్నాడు. దీనితో కరోనా పరిక్షలు చేయగా అతనికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. కరోనా వైరస్ సోకిన దొంగను పోలీసులు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ఇక పైలెట్ కూడా హోం క్వారంటైన్ కి వెళ్ళాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: