తెలంగాణాలో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు దూకుడు పెంచారు. వరుసగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ నేతలు సిద్దమవుతున్నారు. సాగునీటి ప్రాజెక్ట్ లను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెరాస మీద విమర్శలు చేస్తుంది. ఈ నేపధ్యంలోనే జల దీక్షలను చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. 

 

తాజాగా గోదావరి జలదీక్షకు సిద్దమయ్యారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపధ్యంలో పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు భారిగా మొహరించి ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యంతో పాటుగా... మరి కొందరు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: