టీడీపీ సీనియర్ నేత జేసి ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాస్త ఘాటుగా స్పందించారు. సీఎం జగన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటాన్ని సహించలేక అక్రమ అరెస్టులకు తెర తీశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఏడాది పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందకే టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

 

నిన్న అచ్చెన్నాయుడు, నేడు జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టులు జగన్ కక్ష సాధింపు చర్యలేనని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను జైలుకు వెళ్లానన్న అక్కసుతో జగన్ కక్ష పెంచుకుని ఇతరులను జైలుకు పంపుతున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: