టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ నిరసనగా నేడు టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి పిలుపు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో వారి వారి నివాసాల్లో నిరసనలు తెలపనున్నారు టీడీపీ నేతలు.  కాసేపట్లో టీడీపీ సినియర్ నేతలతో వీడియో కాన్ఫెరెన్స్ లో పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతారని తెలుస్తుంది. వరుస అరెస్టుల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ పై టీడీపీ నేతలు చర్చించనున్నారు. 

 

అదేవిధంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాక్షస పాలనా జరుగుతుంది అని సీఎం జగన్ కక్ష పూరిత రాజకీయాలకు తెర లేపారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి నీచ రాజకీయాలు  చూడలేదు అని అన్నారు. టీడీపీ నాయకులూ,కార్యకర్తలు ఎవరు ఆందోళన పడొద్దు అని తెలుగుదేశం మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: