దేశ రాజధాని అయిన ఢిల్లీ లో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరగడం అక్కడి ప్రజల్ని ఆందోళన కలిగిస్తుంది. అక్కడి ప్రజలు కరోనా పరీక్షలు పెంచాలిఅని ప్రభుత్వానికి కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పందించారు.
కోవిడ్- 19 కోసం నిర్వహించిన పరీక్షల సంఖ్య పెరగాలని మీరు కోరుకుంటే, దాని మార్గదర్శకాలను మార్చమని ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ని అడగండి అంటూ ఆయన మీడియాకు సూచించారు. పరీక్షలకు అవసరమైన కొన్ని షరతులను విధించే ఐసిఎంఆర్ మార్గదర్శకాలను మేము ఉల్లంఘించలేము ఆయన స్పష్టం చేసారు. కాగా ఢిల్లీ లో కరోనా పరిక్షలు తక్కువ చేస్తున్నారు అనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
If you want the number of tests conducted for #COVID19 to increase, then ask ICMR (Indian Council of Medical Research) to change its guidelines. We cannot flout ICMR guidelines that state certain conditions which are prerequisite for tests: delhi health minister Satyendar Jain pic.twitter.com/E3PNFZy6cW
— ANI (@ANI) June 13, 2020