సాగునీటి ప్రాజెక్ట్ లపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. రోజు రోజుకి ఈ ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఇక తెరాస సర్కార్ ని ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ దూకుడుగానే వెళ్తుంది అని చెప్పాలి. తాజాగా కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణాను దోచుకుంటున్న ద్రోహి, దుర్మార్గుడు కేసీఆర్ అని ఆరోపణలు చేసారు. 

 

కేసీఆర్ దుర్మార్గాలను బయట పెడుతున్నామనే కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు. మౌనం చాలా ప్రమాదకరమన్నారు. రాష్ట్ర ప్రజలు మౌనం వీడి ప్రశ్నించాలని సూచించారు.  వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. ప్రతి రూపాయి ప్రజలదేనన్న విషయం మర్చిపోవద్దని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో.. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో కేసీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ఇది సత్యమని ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: