తెలంగాణాలో  కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం ఉండటం లేదు. ప్రతీ రోజు కూడా తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణాలో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ శాంతినగర్‌లో 19 మందికి కరోనా పాజిటివ్‌ గా పరీక్షల్లో వెల్లడి అయింది. 

 

వీరు అందరూ ఇటీవల మరణించిన వృద్ధురాలి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆమెకు అధికారులు అనుమానంతో పరిక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఇప్పుడు వీరికి కూడా కరోనా సోకింది ఆమె నుంచే అని అధికారులు పేర్కొన్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న అందరిని కూడా హోం క్వారంటైన్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: