ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. ఏపీలో నేడు ఒక్క రోజే 222 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీకి చెందిన వారికి 186 మందికి కోరనా సోకింది అని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

 


ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 4 వేల 588 కి చేరాయి కరోనా కేసులు. ఏపీలో మొత్తం యాక్టివ్ కేసులు 1865 గా ఉన్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మొత్తం మరణాల సంఖ్య 82 కి చేరుకుంది.  కృష్ణా గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: