మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అధికారులు షాక్ ఇచ్చారు. ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయి అనారోగ్యం కారణంగా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి‌లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు అభ్యర్థనలను అధికారులు తిరస్కరించారు. జైళ్ల శాఖ అధికారులు పరామర్శించేందుకు అనుమతి ఇవ్వలేమని... వెనక్కు వెళ్లిపోవాలని తేల్చి చెప్పారు. 
 
అధికారులు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని.... గత రెండు నెలలుగా ఇవే నిబంధనలు అమలులో ఉన్నాయని చంద్రబాబుకు చెప్పారు. జిజిహెచ్ హాస్పటల్ సూపరింటెండెంట్ ను చంద్రబాబు అచ్చెన్నను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: