పాకిస్తాన్ లో కరోనా కేసులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడి ప్రముఖులకు వరుసగా కరోనా సోకుతుంది. పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది కి కరోనా సోకింది. అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పాకిస్తాన్ లో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ దేశ మాజీ  కేంద్ర మంత్రులకు కూడా కరోనా సోకుతుంది. తాజాగా ఆ దేశ మాజీ ప్రధానికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. 

 

పాకిస్తాన్ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కరోనా పాజిటివ్ వచ్చింది అని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. దీనితో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా అధికారులు ఇప్పుడు కరోనా పరిక్షలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: