హైదరాబాద్ లో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి అని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కి ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. 

 

ఇటీవల ఆయన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన టీ తాగగా టీ మాస్టర్ కి కరోనా ఉంది అని తెలిసింది. ఇక ఆ తర్వాత ఆయన కరోనా పరిక్షలు చేయించుకున్నారు. నిన్న ఆయన డ్రైవర్ కి కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీనితో మళ్ళీ కరోనా పరిక్షలు చేసారు. మళ్ళీ ఆయనకు నెగటివ్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: