దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మూడు లక్షలు దాటాయి. దాదాపు మూడు లక్షల 10 వేల కేసులు నమోదు అయ్యాయి దేశ వ్యాప్తంగా. ఇక మరణాలు కూడా వేగంగా నమోదు అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు ఇప్పుడు వేగంగా పెరుగుతుంది. దాదాపు 50 శాతం వరకు ఉంది కరోనా రికవరీ రేటు. 

 

గత 24 గంటల్లో 7,135 కోవిడ్ -19 రోగులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు 1,54,329 మంది రోగులు కోవిడ్ -19 నుంచి బయటపడ్డారు. కోవిడ్ -19 రోగులలో రికవరీ రేటు 49.95% గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. 1,45,779 క్రియాశీల కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: