దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. కరోనా ఏ మాత్రం కూడా అదుపులోకి రావడం లేదు దేశ వ్యాప్తంగా. గత 24 గంటల్లో 12 వేల కొత్త కేసులు దేశ వ్యాప్తంగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 311 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 

 

అత్యధికంగా ఇప్పటి వరకు లేని విధంగా ఒక్క రోజే 11,929 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా 1,49,348 క్రియాశీల కేసులు ఉన్నాయి 1,62,379 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. 9195 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,20,922 గా ఉంది అని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: