దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా సరే రికవరీ రేటు మాత్రం చాలా వేగంగా పెరుగుతుంది. కరోనా రికవరీ రేటు వేగంగా పెరుగుతుంది అని ప్రస్తుత లెక్కలు చెప్తున్నాయి. ఏకంగా 50.6 శాతం ఉంది మన దేశంలో కరోనా రికవరీ రేటు. అంటే వందలో దాదాపుగా 51 మంది వరకు కరోనా నుంచి ఇప్పుడు బయటపడుతున్నారు. 

 

ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక దేశంలో కరోనా కేసులు 3 లక్షల 20 వేలు దాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం దేశంలో 1,49,348 క్రియాశీల కేసులు ఉన్నాయి అని లెక్కలు చెప్తున్నాయి. 1,62,379 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు అని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: