హైదరాబాద్ లో వారం రోజుల క్రితం షేక్ పేట ఎమ్మార్వో వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. షేక్ పేట ఎమ్మార్వో సుజాత భారీగా అవినీతి చేయడం అంతే కాకుండా వీఆర్వో ని అలాగే  బంజారా హిల్స్ ఎస్సై ని కూడా ఇందులో వాడుకోవడం  సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  తెలంగాణా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఏసీబీ అధికారులకు కరోనా భయం పట్టుకుంది. అది ఏంటీ అంటే... బంజారా హిల్స్ పిఎస్ లో కరోనా కేసులు 15 బయటపడ్డాయి. ఇక ఏసీబీ అధికారులు స్టేషన్ లో ఎస్సై రవీంద్ర నాయక ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు కరోనా ఉంటే మాత్రం అదుపులోకి తీసుకున్న వారికి కూడా వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: