శ్రీవారి దర్శనానికి నిత్యం 6వేల మంది భక్తులను అనుమతిస్తున్నామన్నారు టీటీడీ ఈవో  అనిల్ కుమార్ సింఘాల్. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆన్‌లైన్‌లో ప్రతి రోజు 3 వేల టోకెన్లను జారీ చేస్తున్నామన్నారు. ఒక్క రోజే జూన్ 30 వరకు భక్తులు టోకెన్లను కొనుగోలు చేశారన్నారు. 

 

సర్వదర్శనానికి సంబంధించి ఆఫ్‌లైన్‌లో ప్రతి రోజూ 3వేల టోకెన్లు జారీ చేస్తున్నామని వివరించారు. 21వ తేదీ వరకు భక్తులు టోకెన్లు తీసుకున్నారన్న ఆయన... దర్శన టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే అలిపిరి వద్ద తనిఖీలు చేసి తిరుమలకు అనుమతిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. పరిస్థితి ఆధారంగా చూసి అప్పుడే భక్తుల సంఖ్యను  పెంచుతామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: