చంద్రబాబు, లోకేష్‌పై నోటికొచ్చినట్లు పేలుతున్న నాయకులు.. టీడీపీ అధికారంలోకి రాగానే 70 ఎంఎం సినిమా మొదలవుతుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముందు పుట్టి ఉంటే హిట్లర్ పేరు ప్రపంచానికి తెలిసేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అరాచకప్రదేశ్‌గా మార్చారని ఈ సందర్భంగా ఆయన ఆరోపణలు చేసారు. అక్రమ అరెస్ట్ లతో చంద్రబాబుని మీరు భయపెట్టలేరు అని అన్నారు. 2024 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది అని బుద్దా వెంకన్న మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: