వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మరోసారి తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి అచ్చెన్న మీద ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేసారు. “వాళ్లంతా 20 వేల లోపు జీతాలు పొందే కార్మికులు. ఈఎస్ఐ సభ్యత్వం కింద నెలకు రూ.50-70 చెల్లిస్తారు.అనారోగ్యానికి గురైతే హాస్పిటల్లో మంచి చికిత్స దొరుకుతుందని ఆశపడితే, మీ బినామీ, అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్న చేసిందేమిటి. 900 కోట్ల కుంభకోణానికి పాల్పడి కార్మికుల ఉసురు తీశారని మండిపడ్డారు. 

 

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ మరణించిన కార్మికుల వివరాలను ఆ సంస్థ బయట పెట్టాలి అని  వీరంతా నాసిరకం మందులు, నకిలీ డయాగ్నిస్టిక్ కిట్ల వల్ల వ్యాధి ముదిరి చనిపోయారు అని కార్మికుల అకాల మరణాలకు అచ్చెన్న, పెదబాబు, చినబాబు బాధ్యత వహించాలి అని ట్విట్టర్ వేదికగా విజయసాయి డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: