ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. రాష్ట్రంలో ఒక్క రోజే 300 కరోనా కేసులు దాదాపుగా వచ్చాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాలతో వచ్చిన వారితో కలుపుకుని దాదాపు 300 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత  24 గంటల్లో 253 మంది కరోనా వైరస్ పాజిటివ్ గా తేలారు. 

 

24 గంటల్లో ఇద్దరు కరోనాతో మరణించారు. 82 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 39 మందికి కరోనా సోకింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికీ కరోనా సోకిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఎపీకి చెందిన 253 మందికి ఒక్క రోజే కరోనా సోకింది. ఇక మొత్తం కరోనా కేసులు 6 వేలు దాటాయి ఆంధ్రప్రదేశ్ లో.

మరింత సమాచారం తెలుసుకోండి: