ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంపై ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనంలో ఉన్నట్టు తెలుస్తుంది. గత రెండు రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా కూడా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా ఆయన విమర్శలు చేసారు. పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. 

 

విపక్ష నేతల వ్యాపారాల మీద ఫోకస్ చేసారు అని ఫైన్ లు వేస్తున్నారు అని పార్టీ మారిన వాళ్లకు ఫైన్ లు రద్దు చేస్తున్నారు అని అన్నారు. అంతే కాకుండా పార్టీ మారని వాళ్ళను, ప్రజాదరణ ఉన్న నేతలను  వేధిస్తున్నారు అని చంద్రబాబు ఆరోపించారు. కోర్ట్ తీర్పులతో జగన్ లో తీవ్ర అసహనం ఉందని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: